గాంధీ నగర్: బీజేపీ పాలిత గుజరాత్లో లక్షలాది మంది బాలలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు ప్రభుత్వం శాసనసభకు బుధవారం తెలిపింది. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి భానుబెన్ స్పందిస్తూ, రాష్ట్రంలో సుమారు 5.70 లక్షల మంది బాలలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, దాదాపు 4.38 లక్షల మంది తక్కువ బరువు విభాగంలో, 1.31 లక్షల మంది అత్యంత తక్కువ బరువు క్యాటగిరీలో ఉన్నారని తెలిపారు. జిల్లాలవారీగా చూసినపుడు, అహ్మదాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, ఈ జిల్లాలో 56,941 మంది, గిరిజనుల ప్రాబల్యంగల దహోద్లో 51,321 మంది బాలలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తెలిపారు.