హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి భారీగా చేరికలు జరుగుతున్నాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో వలిగొండ మండలం వేములకొండకు చెందిన సుమారు 100 మంది వివిధ పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పరుస్తున్నామని, గత ప్రభుత్వాలు గ్రామాలను అభివృద్ధి పర్చలేదని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని తెలిపారు.
భువనగిరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని, కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీలు, బీటీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో మిగిలిపోయిన అభివృద్ధిని త్వరలో పూర్తిచేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులను చూసే ఇతర పార్టీల నుంచి చేరికలు పెరుగుతున్నాయని అన్నారు.