హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): పంటనష్టం, వాతావరణ మార్పులు, నీటి లభ్యత వంటి అంశాలను అంచనా వేసేందుకు ఇక్రిశాట్ ఆధునిక భౌగోళిక మ్యాపులను రూపొందించింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో కలిసి మ్యాపింగ్ ప్రాజెక్టు చేపట్టగా.. ప్రస్తుతం అది తుదిదశకు చేరుకున్నది.
దీనిసాయంతో ప్రకృతి వైపరీత్యాలతో కలిగే పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఇక్రిశాట్ డిజైన్ చేసిం ది. ప్రకృతి వైపరీత్యాలను నియంత్రించుకొనేలా, జరిగిన నష్టాన్ని లెక్కించడానికి హై రెజోల్యూషన్ మ్యాపులు సాయపడతాయని ఇక్రిశాట్ పరిశోధకులు తెలిపారు. తెలంగాణతోపాటు అన్ని రాష్ర్టాలతో కూడిన మ్యాపులను అందుబాటులోకి తెచ్చామన్నారు.