హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రతకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకొంటున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళల రక్షణ కోసం హైదరాబాద్ యువకులు ‘అభయ్ కోట్’ పేరుతో రూపొందించిన ప్రత్యేక సేఫ్టీ జాకెట్ను శుక్రవారం కవిత ఆవిషరించారు. మహిళల భద్రత సీఎం కేసీఆర్ ప్రధాన ఎజెండా అని అన్నారు. షీటీంలు ఏర్పాటుచేసి ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిపై ఉకుపాదం మోపుతున్నారని చెప్పారు. వినడం, మాట్లాడడంలో సమస్య ఉన్న మహిళలకు ఎంతగానో అభయ్ కోట్ ఉపయోగపడుతుందని తెలిపారు. దివ్యాంగ మహిళల రక్షణకు ప్రత్యేక పరికరాలు రూపొందించిన యువకులు దినేశ్, శశాంక్రెడ్డి, దినేశ్రెడ్డిని అభినందించారు.
స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు శుక్రవారం రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ కూడా ఎమ్మెల్సీ కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.