హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ‘ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలీసులు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ మానవ హకుల సంఘం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని, దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.