హైదరాబాద్ : రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ (Vemula Manjulamma) మృతిపట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సంతాపం ప్రకటించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా వేల్పూరులో మంత్రి కుటుంబసభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంజులమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కాగా, కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంజులమ్మ హైదరాబాద్ నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ మంజులమ్మ గురువారం మృతి చెందారు.
మంత్రి వేములను ఓదారుస్తున్న ఎమ్మెల్సీ కవిత