హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పీయూసీ చైర్మన్, ఆర్మూర్ శాసనసభ్యుడు జీవన్రెడ్డిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జీవన్రెడ్డిపై హత్యాయత్నం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణలో ఇలాంటి కుట్రలకు చోటులేదన్నారు. నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జీవన్రెడ్డి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని కవిత భరోసా ఇచ్చారు.