హైదరాబాద్, అక్టోబరు 28 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాదర్ సమర్పించారు. శుక్రవారం అజ్మీర్లోని ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తీ దర్గాను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. కవితకు దర్గా పెద్దలు ఘన స్వాగతం పలికారు. మొహియుద్దీన్ చిస్తీ దర్గాకు ఆమె చాదర్ను సమర్పించారు. అన్ని రంగాల్లో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు కవిత తెలిపారు.
తర్వాత దర్గా పెద్దలను కవిత కలుసుకొన్నారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని వారు కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ లౌకికత్వానికి ప్రతీకగా నిలుస్తున్నదని అభినందించారు. రాజస్థాన్లోని పుషర్ దేవాలయం, శ్రీనాథ్జీ ఆలయాలను కూడా కవిత సందర్శించారు. ఆమెతోపాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆజం అలీ, బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా, బొరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు కుద్దూస్, నవీద్ ఇక్బాల్ మరియు అలీం తదితరులు అజ్మీర్ దర్గాని సందర్శించారు.