హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): త్వరలో జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసొసియేషన్ (టీఎస్టీసీఈఏ) ఆదివారం ప్రకటించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్కుమార్ను ఎమ్మెల్సీ బరిలో నిలపనున్నట్టు సంఘం ప్రధాన కార్యదర్శులు దాసరి శ్రీనివాస్, బీ అనంతరామ్, కార్యదర్శి రాజు తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్మానాన్ని అభ్యర్థి సంతోష్కుమార్కు అందజేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీల్లోని టీచర్లు, అధ్యాపకులు సంతోష్కుమార్కు మద్దతునిచ్చి, గెలిపించాలని కోరారు.