హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి మొక్కలు నాటారు. తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ పిలుపు మేరకు పుట్టినరోజు సందర్భంగా సునీత యాదాద్రిలో మొక్కలు నాటారు.