కురవి(సీరోలు), సెప్టెంబర్ 17 : ప్ర జాపాలన కార్యక్రమంలో పాల్గొనేందు కు మహబూబాబాద్కు బయలుదేరిన ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జా టోత్ రాంచంద్రూనాయక్కు గురువా రం త్రుటిలో ప్రమాదం తప్పింది. మ హబూబాబాద్ జిల్లా సీరోలు మం డలం చింతపల్లి శివారు టోల్గేట్ సమీపంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు లో డ్రైవర్ నవీన్కు చెందిన పవర్బ్యాం క్ ఒక్కసారిగా పేలింది.
గన్మెన్లు అప్రమత్త వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే మెడలోని కండువా స్వల్పంగా కాలినట్టు తెలిసింది. యువజన కాంగ్రెస్ నూకల అభినవ్రెడ్డి కారులో ఎమ్మెల్యే మానుకో టకు వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.