నల్లగొండ : జనం లేక రేవంత్ రెడ్డి సభలు వెలవెల పోతున్నాయి. కానీ, కేసీఆర్ మీటింగ్లకు జనం ఎదురు చుస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Rajeshwar Reddy)అన్నారు. మంగళవారం నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(MLC elections) అభ్యర్థి రాకేష్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నల్లగొండ(Nallagonda) పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఐదు నెలల్లో ఒక్క వాగ్ధానం నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. మెగా డీఎస్సీ వేయలేదు. నిరుద్యోగ భృతి లేదు. విద్యార్థులకు భరోసా కార్డు లేదన్నారు. మండలి ఉప ఎన్నికల్లో రాకేష్ రెడ్డి ని ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. తీన్మార్ మల్లన్నను ఘోరంగా ఓడించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఈ సీట్లో గెలిచి మండలి ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగరావేద్దామన్నారు.