జనగామ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తల్లి లక్ష్మి (87) కొద్దిసేపటి క్రితం మరణించారు. హన్మకొండలోని రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్(RMH) లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మరణం పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.