హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా (MLC) ఎన్నికైన ఐదుగురు టీఆర్ఎస్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, పాడి కౌశిక్రెడ్డి, పీ వెంకట్రామిరెడ్డితో శాసన మండలిలోని తన చాంబర్లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. కాగా, రాజ్యసభ సమావేశాల దృష్ట్యా బండా ప్రకాశ్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ మాట ఇస్తే తప్పరన్నారు. హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. మొరిగే కుక్కలకు తన పదవే సమాధానమని చెప్పారు.