హైదరాబాద్ : కేసీఆర్(KCR) పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా(Spiritual center) విలసిల్లిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(MLA Palla) అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురి గ్రామ శ్రీ వేణుగోపాల స్వామి వారి తిరు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు.
స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరంపల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా కేసీఆర్ దేవాలయాల పునరుద్ధరణకు పాటుపడ్డారన్నారు. దేవాలయాలను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, సీనియర్ నాయకులు అంకుగారి శ్రీధర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గదరాజు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.