హైదరాబాద్ : సీఎం కేసీఆర్(CM KCR) పదేండ్ల అభివృద్ధి నమూనా దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని అందోల్(Andhole) బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్(MLA Kranthi Kiran )అన్నారు. సోమవారం అందోల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvada Sabha )లో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడి సాధించి..భావి తరాలు గుర్తించుకునేలా పాలిస్తున్న నేత సీఎం కేసీఆర్ అన్నారు.
కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేశానని తెలిపారు. కేసీఆర్ నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో ప్రతి గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. సింగూరు జలాలు మాకు అందకుండా గతంలో ద్రోహం చేశారు. సీఎం కేసీఆర్ సంగమేశ్వర,బసవేశ్వర ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి మాకు మేలు చేశారు.
దళితబంధును అందరికి వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జోగిపేటలో ఐటీ హబ్ను ఏర్పాటు చేయాలి. రేగోడ్, టేక్మాల్ను సంగారెడ్డి జిల్లాలో కలుపాలని పేర్కొన్నారు. సింగూరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతో పాటు మహిళా రెసిడెన్షియల్ కాలేజీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు.