నల్లగొండ : కోమటిరెడ్డి సోదరులు(Komatireddy brothers) రాజకీయ వ్యభిచారులు అంటూ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy) ఫైర్ అయ్యారు. నకిరేకల్ నియోజకవర్గం కేతేప్లలి మండలం కొర్లపహాడ్లో నిర్వహించన ఎన్నికల ప్రచారంలో నిప్పులు చెరిగారు. రాజగోపాల్ రెడ్డి ఆర్థిక అవసరాల కోసం పార్టీ మారిన వ్యక్తని ఆరోపించారు. తమ్ముడు పార్టీ మారితే మాట్లాడని వెంకట్ రెడ్డి నేను మారితే విమర్శించడం వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శమన్నారు.
అభివృద్ధి కోసమే నేను పార్టీ మారానని తెలిపారు. నేను మారిన పార్టీ కారు గుర్తు నుంచి పోటీలో ఉన్నానని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారి నేడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీలుగా ఉన్న అన్నదమ్ములు భువనగిరి పార్లమెంటు నియోజక వర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శిం చారు.
హత్యా రాజకీయాలకు పాల్పడే వ్యక్తులకు అండగా ఉండడం కోమటిరెడ్డి సోదరులకు తగదన్నారు. హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని వారికి ఎమ్మెల్యే హితవు పలికారు. దొంగల ముఠా లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు ప్రజలు నమ్మవద్దని కోరారు. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు.