హైదరాబాద్, మే10 (నమస్తే తెలంగాణ): షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని సోమవారం స్వగ్రామం ఎలక్షన్పేటలో ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ పౌరుడు తమ వంతుగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి, ఆక్సిజన్ కొనుక్కొనే అవసరం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్కుమార్ నేతృత్వంలో మహాయజ్ఞంలా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొనటం తనకు ఆనందంగా ఉందని అన్నారు. ఇంతగొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ టీఆర్ఎస్ నాయకుడు గజ్జెల నరేశ్ కూడా జన్మదినం సందర్భంగా గ్రీన్ చాలెంజ్లో పాల్గొన్నారు. బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయ ఆవరణలో మొక్కలు నాటారు.