సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్ధిపేట శివమ్స్ గార్డెన్స్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట వారి సౌజన్యంతో మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సోమవారం మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..ప్రజల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ప్రతినిధులు ప్రశంసనీయమన్నారు. ఇతర క్లబ్లకు లయన్స్ క్లబ్ ఆదర్శంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. సామాజిక సేవలో స్వచ్ఛంద సంస్థలు ముందుండాలని పిలుపునిచ్చారు.