Minister Dayakar Rao | అన్ని కులవృత్తులకు న్యాయం చేసింది ముఖ్యమంత్రి కేసీఆరేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ మేదరి సంఘం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి మంత్రి దయాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేదరి కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల వృత్తి, నిరుపేద కుటుంబాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు కులాలను పట్టించుకున్న వారు ఎవరూ లేరని, మన కులాలను, కుల వృత్తులను అంతరించిపోయే దశకు తీసుకువచ్చారని మంత్రి.. అప్పటి, ఇప్పటి పరిస్థితులను అందరూ విశ్లేషించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ సీఎం అయ్యాక అన్ని కులాలకు సమ న్యాయం చేశారని, రాష్ట్రస్థాయిలో అన్ని కులాల ఆత్మ గౌరవ భవనాలకు స్థలాలు కేటాయించారన్నారు. అంతరించిపోతున్న కులవృత్తుల అభివృద్ధికి నిధులు కేటాయించి అండగా నిలిచారని కొనియాడారు.
ఒక్కప్పుడు మేదరులను ఎవరైనా పట్టించుకున్నారా? అంటూ ప్రశ్నించారు. ఏవైనా సమస్యలుంటే మంత్రి హరీశ్రావు లేదంటే తన దృష్టికి తీసుకురావాలని.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరికీ తెలుసునని, ఈ పథకాలు దేశంలో ఎక్కడైనా అమలవుతున్నాయా? ఒకసారి ఆలోచన చేయాలన్నారు. మరోసారి సీఎం కేసీఆర్ను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.