హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): తన కవితలతో తెలంగాణ సమాజంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన గొప్పకవి డాక్టర్ సీ నారాయణరెడ్డి అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ కొనియాడారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకొన్న ఆయన సినీ రంగంలో తనదైన శైలితో తెలంగాణ కీర్తి, ప్రతిష్ఠలను చాటి చెప్పారని పేర్కొన్నారు. సినారె జయంతి సందర్భంగా శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
సినారె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు సినారె కవితలు అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. బంజారాహిల్స్లో కోట్ల రూపాయల విలువైన భూమిని కేటాయించి సినారె జ్ఞాపకార్థం ‘సినారె సాహిత్య సారస్వత సదనం’ నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, కాళోజీ పురసార గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి, సాహితీవేత్త కేపీ అశోక్కుమార్, సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.