నాంపల్లి కోర్టులు, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రిపై విచారణ జరిపే అధికారం జిల్లా కోర్టుకు ఉన్నదా అని నాంపల్లిలోని ఒకటవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రమాకాంత్ ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్పై నమోదైన కేసు విచారణ సందర్భంగా గురువారం పిటిషనర్ తరఫు న్యాయవాది రాఘవేంద్రరాజును జడ్జి పలు ప్రశ్నలు అడిగారు.
ప్రత్యేక జిల్లా కోర్టుకు ఉన్న అధికారాలకు సంబంధించిన జీవో కాపీని, గతంలో ఇలాంటి కేసుల్లో వెలువడిన తీర్పుల ప్రతులను సమర్పించాలని ఆదేశించారు. అయితే, తనకు ఇతర కోర్టులో మరో కేసు ఉన్నందున కొంత సమయం కావాలని న్యాయవాది కోరటంతో తదుపరి విచారణను వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేశారు.