హైదరాబాద్: ఇంటర్ ఫలితాలు (Inter results) మంగళవారం వెలువడనున్నాయి. ఫలితాలను ఈ నెల 28న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఫలితాలను https://tsbienew.cgg.gov.in/, https://results. cgg.gov.in, https://examresults.ts.nic.in లో చూడాలని ఆమె కోరారు. మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. అందులో 4,42,767 మంది సెకండియర్ విద్యార్థులు, 4,64,626 మంది ఫస్టియర్ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. వీరంతా ఈ ఏడాది మే 6 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,443 కేంద్రాల్లో పరీక్షలు రాశారని చెప్పారు. విద్యార్థులు ఒత్తిడికి గురైనా, ఇతర సమస్యల పరిష్కారానికి టోల్ఫ్రీ నం.18005999333ను సంప్రదించవచ్చని మంత్రి సూచించారు.
ఇంటర్ ఫలితాలను నమస్తే తెలంగాణ వెబ్సైట్లోనూ చూసుకోవచ్చు.
ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి