హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): నీట్లో మంచి ర్యాంక్ రాకపోయినా.. మన దగ్గర మెడికల్ కాలేజీలో సీటు దక్కకపోయినా.. డాక్టర్ డ్రీమ్ వదులుకోవాల్సిందేనా.. అంటే కాదంటున్నాయ్ విదేశీ విశ్వవిద్యాలయాలు. తక్కువ ఖర్చుతో, సెమిస్టర్ ప్రకారం వాయిదాల పద్ధతిలో ఫీజులు చెల్లించే అవకాశముండటంతో డాక్టర్ కావాలనుకొనేవారు విదేశాల్లో ఎంబీబీఎస్కు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటివారికి టీ న్యూస్, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న అబ్రాడ్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ మార్గనిర్దేశం చేస్తున్నది. ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ప్రాంగణంలోని విశ్వేశ్వరయ్యభవన్లో ఏర్పాటుచేసిన ఈ ఫెయిర్ను విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి శనివారం ప్రారంభించారు. రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, కజికిస్తాన్, కిర్గిస్తాన్, వియత్నాం వంటి దేశాల్లో వైద్యవిద్యను అనభ్యసించేందుకు కావాల్సిన సమాచారాన్ని పలు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు రెండ్రోజులపాటు నిర్వహించే ఎడ్యుకేషన్ ఫెయిర్లో అందిస్తున్నాయి.
రష్యా..
30 ఏండ్లుగా మన వాళ్లు వైద్యవిద్య కోసం రష్యాకు వెళ్తున్నారు. కోర్సు కాల వ్యవధి ఐదు సంవత్సరాల 8 నెలలు. ఎంబీబీఎస్ను ఇంగ్లిష్లో చదువుకోవాలి. ట్యూషన్ ఫీజులు రూ.16 -17 లక్షలు.ఇక హాస్టల్ ఫీజులు తక్కువ.
ఉక్రెయిన్..
ఉక్రెయిన్లో భారత్తోపాటు 70 దేశాల విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతారు. కోర్సు ఏడేండ్లు. 15 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉంటారు. స్థానిక భాష నేర్చుకోలి. వీసా నిబంధనలు కఠినం. కోర్సు ఫీజు రూ. 21-22 లక్షలు.
ఫిలిప్పీన్స్..
ఏటా వేలమంది భారతీయులు ఫిలిప్పీన్స్కు వెళ్తున్నారు. కోర్సు ఐదేండ్లు. అత్యధికులు ఇంగ్లిష్లో మాట్లాడటంతో భాషా సమస్యలుండవు. ఇంటర్న్షిప్ను భారత్లో చేయవచ్చు. ఫీజు
రూ.20-25 లక్షలు.
వియత్నాం..
వియత్నాంలో ఎంబీబీఎస్ కోర్సు సిలబస్.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సిలబస్కు దగ్గరగా ఉంటుం ది. కోర్సు కాల వ్యవధి ఆరేండ్లు. ఫీజులు సెమిస్టర్వారీగా చెల్లించవచ్చు. 12 సెమిస్టర్లకు రూ.28 లక్షల ఫీజు.
జార్జియా..
జార్జియా పర్యాటకంగా సుందరదేశం. ఎంబీబీఎస్తోపాటు, పీజీ కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. కోర్సు వ్యవధి ఆరు సంవత్సరాలు. ట్యూషన్ ఫీజు 30 -42 వేల యూఎస్ డాలర్లు. రవాణా ఖర్చులు సైతం తక్కువే.
కజకిస్థాన్..
ఈ దేశంలో కోర్సు వ్యవధి ఏడేండ్లు. చివరి ఏడాది డాక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది. డోనేషన్లు తీసుకోరు. ఇంగ్లిష్లో బోధన. కాలేజీల్లో మౌలిక వసతులు నామమాత్రం. బోధనా నాణ్యత సైతం అంతంతే.
రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విద్యాశాఖ మం త్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. టీ న్యూస్, నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్యభవన్లో ఏర్పాటుచేసిన అబ్రాడ్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ను శనివారం ఆమె ప్రారంభించారు. విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం తెలుగు రాష్ర్టాల నుంచి ఏటా 4-5 వేలమంది వెళ్తున్నారని తెలిపా రు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఐదువేల పైచిలుకు సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల ఏడు ప్రభుత్వ, రెండు ప్రైవేట్, ఒక సింగరేణి మెడికల్ కాలేజీ అందుబాటులోకి వచ్చాయని, వీటితో మరో 1,500 సీట్లు పెరిగే అవకాశం ఉన్నదని చెప్పా రు. కార్యక్రమంలో టీన్యూస్ ఎగ్జిగ్యూటివ్ ఎడిటర్ సురేశ్బాబు, సీజీఎం ఉపేందర్, ఏజీఎం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం ప్రకా రం.. ఎంబీబీఎస్ చదివి డాక్టర్గా ప్రాక్టీస్ మొదలెట్టాలంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) రాయాల్సిందే. గతంలో దేశంలోని వారు ఎంబీబీఎస్ పట్టా పొంది నేరుగా డాక్టర్ అయ్యేవారు. విదేశాల్లో వైద్యవిద్య పూర్తిచేసినవారు మెడికల్ కౌన్సి ల్ ఆఫ్ ఇండియా నిర్వహించే స్క్రీనిం గ్ టెస్ట్కు హాజరయ్యేవారు. కానీ, 2023 తర్వా త మెడికల్ పట్టా పొందినవారంతా నెక్ట్స్ రాయాల్సిందే. ఈ లెక్కన ఎంబీబీఎస్ ఎక్కడ చదివినా ఒకటే.