హైదరాబాద్ : రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ రెండు రోజుల కిత్రం కన్నుమూశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీఎస్ ఫుడ్స్ డీజీఎం కృష్ణవేణి, మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు మంత్రిని పరామర్శించారు. ఈ సందర్భంగా లింగ్యా నాయక్ చిత్రపటం వద్ద నివాళులర్పించి, కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు
శాంతిచేకూరాలని ఆకాంక్షించారు.