వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి లావణ్య కుటుంబాన్ని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. ఆత్మవిశ్వాసంతో జీవించాలని సూచించారు. సమస్యలు ఉంటే పక్కవారితో పంచుకోవాలి తప్ప మనసులో పెట్టుకుని బాధపడొద్దన్నారు. లావణ్య సోదరుడు భరత్పై చదువుకు సాయం అందిస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని లావణ్య కుటుంబ సభ్యులకు మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.