వనపర్తి : భూ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది. నిబంధనలకు లోబడి అర్హులైన నిర్వాసితులందరికి అందరికి పరిహారం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బండరావిపాకులలో నూతనంగా నిర్మించిన పశు వైద్యశాల, ఆరోగ్య ఉపకేంద్రం, గ్రామ పంచాయతీ భవనాలను మంత్రిని ప్రారంభించి మాట్లాడారు.
మీ ఇండ్లు, భూములు ప్రాజెక్టు కోసం ఇచ్చారు. మీ త్యాగాన్ని ప్రభుత్వం ఎన్నడూ తక్కువ చేసి చూడదు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రకారం లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు మీరు భూములు త్యాగంచేయడం గొప్ప విషయం అన్నారు.
మీరు కోరిన విధంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం అందిస్తామని మంత్రి హామీనిచ్చారు. ప్రభుత్వపరంగా మీకు అందే ప్రతి సాయం అందేలా చూస్తామని మంత్రి తెలిపారు. చేపల సంఘం ఏర్పాటుకు సహకార శాఖలో నమోదు చేసుకోవాలని సూచించారు.
దసరా తర్వాత కొంకలపల్లి గ్రామస్తులు ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణ పనులు మొదటు పెట్టాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.