వనపర్తి, సెప్టెంబర్ 18: గిరిజనుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని, అందులో భాగంగానే సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాకేంద్రంలోని బిజినగడ్డతండాలో రూ.12 లక్షలతో నిర్మించిన గిరిజన కమ్యూనిటీ హాల్ను శనివారం గిరిజన మహిళతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి నిధులను ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తున్నదని చెప్పారు. ఆ నిధులతో కావాల్సిన సదుపాయాలు కల్పించుకుంటున్నారని వివరించారు. అంతకుముందు పలువురికి సీఎం సహాయనిధి నుంచి విడుదలైన చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.