హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీల్లో నిర్దేశిత అభివృద్ధి పనులను సత్వరమే పూర్తిచేసేందుకు చొరవ చూపాలని మంచిర్యాల జిల్లా నేతలకు మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, అజ్మీరారేఖానాయక్ మంగళవారం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్, మందమర్రి, నస్పూర్, లక్షెటిపేట, బెల్లంపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల అభివృద్ధిపై మంత్రితో చర్చించారు. ఆయా మున్సిపాలిటీలలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రికి వివరించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యేలతో మంత్రి చెప్పారు. ఎమ్మెల్యేల ఆహ్వానం మేరకు త్వరలో జిల్లాలో పర్యటిస్తానని మంత్రి కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.