రాజన్న సిరిసిల్ల : వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు, వార్డు కౌన్సిలర్లకు మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. జులై 1న ప్రారంభమైన పట్టణ ప్రగతి 10 రోజుల పాటు కొనసాగనుంది.
వేములవాడ మున్సిపాలిటీలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి శ్రీ @KTRTRS పాల్గొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టాల్సిన పనుల పై అధికారులకు, వార్డు కౌన్సిలర్లకు దిశా నిర్దేశం చేశారు. pic.twitter.com/k7PhfnA2I2
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 3, 2021