తెలంగాణలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభం కానుంది. దీని వల్ల వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రంగారెడ్డి జిల్లా కొడంకల్లో మేధ గ్రూప్.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని త్వరలోనే ప్రారంభించనుంది. భారత్లో ఉన్న అతి పెద్ద ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీలలో ఇది ఒకటి. రూ.800 కోట్లతో రైల్వ్ కోచ్ ఫ్యాక్టరీని మేధ ఏర్పాటు చేయనుంది. సుమారు 2 వేల మందికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ త్వరలోనే రైల్ కోచ్లను మ్యాన్ఫాక్చర్ చేసి షిప్పింగ్ చేయనుంది. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నందుకు మేధ యాజమాన్యానికి కృతజ్ఞతలు అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ యూనిట్ ఫోటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
One of India’s largest private rail coach factories, set up by Medha Group is ready for inauguration soon at Kondakal
Proud that Telangana will soon be manufacturing & shipping out rail coaches 😊
My sincere thanks to Yugandhar Reddy Garu & his able team on making this happen👍 pic.twitter.com/dsNRKnfHol
— KTR (@KTRTRS) February 6, 2022