హైదరాబాద్: హైదరాబాద్లోని జీఎంఆర్ (GMR) ఏరోసిటీలో అమరరాజా ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్కు (E-positive Energy labs) మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాపన చేశారు. గిగా కారిడార్లో (Giga corridor) భాగంగా అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న నిర్మిస్తున్న అధునాతన ఇంధన పరిశోధన, ఆవిష్కరణ కేంద్రానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అమర రాజా సీఎండీ జయదేవ్ గల్లా, ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్గేచీ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక కంపెనీలకు తెలంగాణ ఫేవరెట్ అని మంత్రి కేటీఆర్ అన్నారు.