హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం అనతికాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ గా అవతరిస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేండ్లలో హైదరాబాద్ రూపురేఖలే మా రిపోయాయని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో సిట్కో కొత్త యూనిట్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం గా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడేనాటికి హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల సంఖ్య 3.23 లక్షలు ఉంటే, గత ఏడాది జూన్ నాటికి 10 లక్షలకు పెరిగిందని తెలిపారు. టెక్నాలజీ రంగంలో తెలంగాణ అనూహ్యమైన ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్, డిఫె న్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్.. ఇలా అనేక రం గాల్లో అద్భుత ప్రగతి సాధించామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం యువత భవిష్యత్తుకు చక్కటి మార్గం చూపే కేంద్రంగా మా రిందని అన్నారు. నగరంలో అనేక నైపుణ్య కేంద్రాలు, కోచింగ్ సెంటర్లు, బిజినెస్ స్కూళ్లతోపాటు పేరెన్నికగన్న విద్యా సంస్థలు కొలువుదీరాయని తెలిపారు.
‘ఇమేజ్ టవర్స్, యా నిమేషన్, గేమింగ్, మల్టీమీడియా కోసం హై దరాబాద్లో ఒక కేంద్రం ఏర్పాటు కాబోతున్నది. ఇది 18 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ గా అవతరించబోతున్నది’ అని చెప్పారు. హై దరాబాద్లో సిట్కో శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా తెలివైన నిర్ణయం తీ సుకొన్నదని అన్నారు. సిట్కోకు మనీలాలో 3,500 మంది, టొరంటో కేంద్రంలో 2,500 మందే పనిచేస్తున్నారని.. కానీ, హైదరాబాద్ లో అమెజాన్ సంస్థకు చెందిన వరల్డ్ లార్జెస్ట్ క్యాంపస్ ఉన్నదని తెలిపారు. మైక్రోసాఫ్ట్, మె టా, యాపిల్, గూగుల్, ఉబర్, మైక్రాన్, క్వా ల్కామ్ సంస్థల రెండో అతిపెద్ద క్యాంపస్లకు హైదరాబాద్ నిలయమైందని చెప్పా రు. సిట్కోకు చెందిన ప్రపంచంలోనే రెండో అ తిపెద్ద క్యాంపస్ కూడా హైదరాబాద్లో ఉం డాలని, ఆ దిశగా కలిసి పనిచేద్దామని చెప్పా రు.
సకల సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం
హైదరాబాద్ నగరం అన్ని సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనమని కేటీఆర్ తెలిపా రు. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలకు హైదరాబాద్లో ఉన్నారని, వారంతా తమ సొం తూళ్లో ఉన్నట్టే భావిస్తారని చెప్పారు. ‘అనేక దేశాలకు చెందిన వ్యక్తులు హైదరాబాద్లో ని వసిస్తున్నారు. ద్వేషం, హింసకు ఏమాత్రం చో టులేదు. మత సామర్యానికి హైదరాబాద్ ప్ర తీక. హైదరాబాద్ బి ర్యానీ, హలీమ్ వరల్డ్ ఫే మస్’ సాధారణంగా ఏ రాష్ట్రమైనా దేశంలోని మిగిలిన రాష్ర్టాలతో పోటీ పడుతుంది. హైదరాబా ద్ మాత్రం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థా యికి ఎదిగింది’ అని కేటీఆర్ తెలిపారు.
రెం డేండ్ల క్రితం హైదరాబాద్లో సిట్కో సెంటర్ ను ప్రారంభించామని, ఇప్పుడ కొత్తగా సెంట ర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణాన్ని పూర్తిచేయటం సంతోషంగా ఉన్నదని సిట్కో ఫండ్ సర్వీసెస్ (యూఎస్ఏ) హెడ్ జే పెల్లర్ వెల్లడించారు. ప్ర పంచంలోని అనేక కేంద్రాలతో పోటీ పడుతూ హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం పనిచేస్తుంద ని విశ్వాసం వ్యక్తంచేశారు. ‘అత్యంత సంపన్న ఆర్థిక కేంద్రాల్లో ఒకటిగా హైదరాబాద్ అవతరిస్తున్నది. అందుకే ఇక్కడ సెట్కో కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని భావిస్తు న్నాం. సంస్థ బలోపేతానికి మరింత కష్టపడి పనిచేస్తాం’ అని సిట్కో గ్రూప్ సర్వీసెస్ (ఇండియా) ఎల్ఎల్పీ హైదరాబాద్ బ్రాంచ్ జనరల్ మేనేజర్ అమిత్ వర్మ పేర్కొన్నారు. సిట్ కో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రపంచంలోని పేరెన్నికగన్న సంస్థ ల్లో ఒకటి. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్నది. కంపెనీకి 36 దేశాల్లో పరిపాలన, కార్యాకలాపాల కింద 1.8 ట్రిలియన్ డాలర్లకుపైగా ఆస్తులున్నాయి.
పాలన ఎలాగో యోగీకి చెప్పండి: ఉత్తరప్రదేశ్ ఉద్యోగులకు కేటీఆర్ సూచన
హైదరాబాద్లో ద్వేషం, హింసకు తావులేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శాంతిభద్రతల విషయంలో తాము అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్లో సిస్కో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. సంస్థలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఉద్యోగులనుద్దేశించి ఓ సూచన చేశారు. ‘మేం మిమ్మల్ని ఎలా చూసుకొంటున్నామో యోగీ (యూపీ సీఎం)కి చెప్పండి. ఆయన ఎలా ముందుకెళ్లాలో వివరించండి’ అని సూచించారు. హైదరాబాద్ నగరం సకల జాతులు, సంస్కృతుల సమ్మేళనమని పేర్కొన్నారు. ‘ఎవరైనా, ఎక్కడివారైనా హైదరాబాద్కు వస్తే ఈ నగరం తమ ఇంటిలాగే భావిస్తారు. అన్ని సంస్కృతులను ఆహ్వానించే అద్భుతమైన నగరం హైదరాబాద్. ఇది ఎలాంటి ఇబ్బందులు లేని నగరం. ప్రస్తుతం రంజాన్ సీజన్ నడుస్తున్నది. హైదరాబాద్కే ప్రత్యేకమైన హలీమ్, బిర్యానీని ఆస్వాదించారా?’ అని ఉద్యోగులను ప్రశ్నించారు.