హైదరాబాద్: నగరంలో కొత్తగా నిర్మించిన షేక్పేట ఫ్లై ఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నూతన సంవత్సర బహుమతిగా ఫై ఓవర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆరంభించారు. నగరంలోని పొడవైన వంతెనల్లో షేక్పేట ఫ్లై ఓవర్ ఒకటి. రూ.333 కోట్లతో 2.71 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా టోలిచౌకి నుంచి ఖాజాగూడ చౌరస్తా వరకు దీనిని నిర్మించారు. దీంతో మెహదీపట్నం-హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.