సిద్దిపేట, ఏప్రిల్ 12 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ తదితరులు సిరిసిల్ల పర్యటనకు వెళ్తూ ఏరియల్ వ్యూ ద్వారా సిద్దిపేట జిల్లాలోని కాళేశ్వర జలాలతో నిండుకుండలా ఉన్న కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్లను చూసి మంత్రముగ్ధులయ్యారు.
ప్రస్తుతం మల్లన్నసాగర్ రిజర్వాయర్లో 11.54 టీఎంసీలు, కొండపోచమ్మ రిజర్వాయర్లో 9.3 టీఎంసీల గోదావరి జలాలు ఉన్నాయి. గత మూడేండ్ల నుంచి జిల్లాలోని వాగులు, చెరువులను మండు టెండల్లో గోదావరి జలాలతో నింపుతున్నారు.