హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయమని, అందుకు తనను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయస్ఫూర్తికి విరుద్ధమని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉన్నదని పేర్కొన్నారు.
టీపీసీసీ క్రమశి క్షణ కమిటీ జారీ చేసిన నోటీసుకు సురేఖ గురువారం వివరణతో కూడిన లేఖను కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపారు. అందులో తన వివర ణతో స్పష్టతనిచ్చారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, ఆ ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదని సురేఖ చెప్పారు.