నర్సరీలో వినూత్న ప్రయోగాలు సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంగారెడ్డికి చెందిన గంగా నర్సరీ అధినేత ఐసీ మోహన్ మామిడిలో సరికొత్త వంగడాన్ని సృష్టించారు. బంగినపల్లి మామిడిని పోలి ఉండే ఈ వంగడానికి ‘గంగా’ గా నామకరణం చేశారు. సోమవారం ఉదయం మోహన్.. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో గంగా వంగడాన్ని ఆవిష్కరింపజేశారు. ఆధునిక పరిజ్ఞానంతో ఫార్మ్ హౌజ్లకు సరికొత్త వంగడాలను రూపొందించే మోహన్ మామిడిలో నూతన రకాన్ని సృష్టించడం అద్భుతమైన ప్రయోగమని మంత్రి జగదీశ్రెడ్డి అభినందించారు. హార్టికల్చర్ రంగంలో ఇప్పటికే గంగా నర్సరీ విశిష్ఠ గుర్తింపు పొందింది.