నిర్మల్: తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ (Professor Jayashankar Sir) అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy)అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు సార్ కల అని.. సీఎం కేసీఆర్ (CM KCR) దానిని నిజం చేసిచూపించారని ప్రశంసించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జయశంకర్ సార్ తెలంగాణే ఊపిరిగా శ్వాస ఉన్నంత వరకు జీవించారిన చెప్పారు. జీవిత చరమాంకం వరకు తెలంగాణ కోసం ఉద్యమించారని ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కేసీఆర్కు వెన్నంటి ఉండి రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారని కొనియాడారు.