నిర్మల్ : నిర్మల్ పట్టణం గాయత్రిపురంలో నూతనంగా నిర్మించనున్న బ్రాహ్మణ భవన్కు ఆదివారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పండితులు మంత్రికి పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ.15 లక్షల నిధులతో భవనం నిర్మిస్తున్నామన్నారు. అలాగే రూ.10 లక్షలు కల్యాణ మండపం, షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామని మంత్రి తెలిపారు.
మార్చి 8 అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మహిళలు కేసీఆర్ మహిళా బంధు సంబురాలు నిర్వహించారు. మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి రాఖీలు కట్టారు.