హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సినీ పరిశ్రమకు, సాహిత్య రంగానికి తీరని లోటని మంత్రి హరీశ్రావు (Harish rao) అన్నారు. సినిమా పాటల్లో సిరివెన్నెలది ప్రత్యేక స్థానమన్నారు. ఫిల్మ్ చాంబర్లో సిరివెన్నల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి మంత్రి నివాళులర్పించారు. అశ్లీలం, ద్వంద్వార్థాలు లేని పాటలు రాసిన గొప్ప రచయిత అని, సినిమా పాటల్లోనూ సాహిత్యానికి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారని పేర్కొన్నారు. పండితులు, పామరులను సైతం మెప్పించిన గొప్ప వ్యక్తిత్వమని చెప్పారు.