సంగారెడ్డి : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని నారాయణఖేడ్లోని ఏరియా హాస్పిటల్లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు రక్తదానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతిగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. కేసీఆర్కు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్షు ప్రసాదించాలని మంత్రి ఆకాంక్షించారు. తలసేమియా, గర్భిణి స్త్రీలతో పాటు చాలా మందికి రక్తం అవసరం ఉంటుంది. అటువంటి వారికి ఈ రక్తాన్ని ఉచితంగా ఇచ్చే విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేస్తున్నారు అని హరీశ్రావు తెలిపారు.
On the birthday eve of Hon'ble #CMKCR Garu, I have donated blood at Narayankhed Area Hospital.
CM KCR Garu is a leader who has served and continues to serve the people, we follow his able leadership for serving mankind.#HappyBirthdayKCR pic.twitter.com/Uv5L3rIFzD
— Harish Rao Thanneeru (@trsharish) February 16, 2022