కరీంనగర్ : పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బుధవారం కరీంనగర్లో పలు చోట్ల జరిగిన ఘనతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీగల గుట్టపల్లి తెలంగాణ భవన్, కోర్టు చౌరస్తా, మీ సేవా కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్ జెండావిష్కర్కరించారు.
మొదట కోర్టు వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో జరిగిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అభినందన సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కరోనా రెండో డోసు వ్యాక్సిన్ 100 శాతం పూర్తి చేసిన ఐదు పీహెచ్ సీలకు రూ. లక్ష చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందించారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు కనువల్ల విజయ, ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డి, కలెక్టర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.