హైదరాబాద్ : తిరుమల శ్రీవారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు మహేందర్రెడ్డి, భానుప్రసాదరావు తదితరులు బుధవారం దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందిచగా, టిటిడి ఆలయ అధికారులు స్వామి వారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థించినట్లు వారు తెలిపారు.