హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పలు జిల్లా పరిషత్ల సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సోమవారం కలిశారు. తమకు పదోన్నతులు కల్పించినందుకు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా, ప్రజలకు ప్రభుత్వ పథకాలన్నీ సకాలంలో అందేవిధంగా పని చేయాలని మంత్రి ఈ సందర్భంగా వారిని కోరారు. మంత్రిని కలిసిన వారిలో సీఈఓలు, డిప్యూటీ సీఈఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేందర్ రావు, ఎంపీడీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం సత్తయ్య, పలువురు సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు ఉన్నారు.