ఒకప్పుడు గుక్కెడు నీళ్ల కోసం అరిగోసపడ్డ తెలంగాణ.. ఇయ్యాల నిండు నీళ్లల్లో తానమాడుతున్నది. బతుకలేక పల్లెనొదిలి పట్నమొచ్చిన ప్రజలు.. ఇయ్యాల పట్నమొదిలి పల్లెబాట పట్టారు. సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో మెట్ట ప్రాంతాలు ఇప్పుడు పంట పొలాలతో కళకళలాడుతున్నాయి. జనగామ జిల్లా నర్మెట మండలంలోని మల్లన్నగండి రిజర్వాయర్ కింద రైతులు వేసిన పంట పొలాలతో పుడమి తల్లి పచ్చని చీరను సింగారించుకున్నట్టు కనిపిస్తున్నది.
– ఫొటోగ్రాఫర్, జనగామ