ఢిల్లీ ,జూన్ 8: కోవిడ్-19 స్వల్ప లక్షణాలు కలిగిన వారికి వారి ఇళ్లలోనే రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ” మేము మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాం ‘ కార్యక్రమాన్ని పిరమల్ ఫౌండేషన్ తో కలసి నీతీ ఆయోగ్ ప్రారంభించింది. కోవిడ్-19 స్వల్ప లక్షణాలు కలిగినవారికి 112 జిల్లాల్లో అమలు జరుగుతున్న కార్యక్రమంలో జిల్లాల అధికారులకు ఈ కార్యక్రమం కింద నీతీ ఆయోగ్, పిరమల్ ఫౌండేషన్ తమ సహకారాన్ని అందించనున్నాయి.
ఎంపిక చేసిన 112 జిల్లాల్లో స్థానిక నాయకులూ, ప్రజా సంఘాలు, స్వచ్చంధ కార్యకర్తల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. కొత్తగా ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి కార్యక్రమంలో చర్యలను చేపడతారు.జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షునిగా వ్యవహరించే కార్యక్రమంలో స్వచ్చంధ సేవా సంస్థలను భాగస్వాములుగా చేస్తారు. దీనికోసం స్థానికంగా పనిచేస్తున్న 1000కి పైగా స్వచ్చంధ సేవా సంస్థలను ఎంపిక చేసి లక్ష మంది స్వచ్చంధ కార్యకర్తలకు శిక్షణ ఇస్తారు. ఇలా శిక్షణ పొందినవారు రోగుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటారు. స్వచ్చంధ సేవా సంస్థలు, కార్యకర్తలకు అవసరమైన శిక్షణను పిరమల్ ఫౌండేషన్ అందిస్తుంది.
” మేము మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాము’ కార్యక్రమాన్ని నీతీ ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్-19 పరిస్థితిని ఎదుర్కోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. కోవిడ్ వల్ల సమస్యలను ఎదుర్కొంటున్న బలహీనవర్గాలకు చెందిన ప్రజలకు జిల్లా యంత్రాంగాల సహకారంతో ఈ కార్యక్రమం ద్వారా అండగా నిలుస్తామని ఆయన తెలిపారు. కోవిడ్ బారినపడి స్వల్ప లక్షణాలు కలిగినవారిలో 70శాతం మందికి ఇండ్ల లోనే సంరక్షణ అందించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. దీనివల్ల ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి తగ్గడమే కాకుండా ప్రజలకు ధైర్యం కలిగించడానికి అవకాశం కలుగుతుంది. జిల్లాలకు సరఫరా అయిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలకు ఈ కార్యక్రమం సాయ పడుతుంది.