హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జస్టిస్ విలాస్ వీ అఫ్జల్పూర్కర్ను అథారిటీ చైర్మన్గా నియమిస్తూ హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రస్థాయి కమిటీ సభ్యులుగా రిటైర్డ్ ఐపీఎస్ నవీన్చంద్, సభ్య కార్యదర్శిగా శాంతిభద్రతల అడిషనల్ డీజీ వ్యవహరిస్తారని జీవోలో పేర్కొన్నారు. అదేవిధంగా రెండు జిల్లా పోలీస్ ఫిర్యాదుల అథారిటీలను కూడా ఏర్పాటు చేశారు. వీటిలో హైదరాబాద్ రీజియన్ అథారిటీకి చైర్మన్గా రిటైర్డ్ జిల్లా జడ్జి కే సంగారెడ్డిని నియమించారు. సభ్యుడిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏ వెంకటేశ్వర్రావు, సభ్య కార్యదర్శిగా వెస్ట్జోన్ ఐజీని నియమించారు. వరంగల్ రీజియన్ జిల్లా పోలీస్ ఫిర్యాదుల అథారిటీ చైర్మన్గా రిటైర్డ్ జిల్లా జడ్జి ఎం వెంకటరమణరావు, సభ్యుడిగా రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ జే లక్ష్మీనారాయణ, సభ్యకార్యదర్శిగా నార్త్జోన్ ఐజీని నియమించారు.