L Ramana |నిమ్స్ ఆస్పత్రిలో మెడిసిన్స్ ధర అధికంగా ఉంటున్నాయని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రిలోనూ అదేవిధంగా అధిక ధరలు ఉంటున్నాయని పేర్కొన్నారు. బయటి మెడికల్ షాపు రేట్లతో సమానంగా మెడిసిన్స్ అమ్ముతున్నారని విమర్శించారు.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో ఎల్.రమణ మాట్లాడుతూ.. మందులు కొనలేక పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వమే మందులు సరఫరా చేసి పేద రోగులకు ఉపశమనం కలిగించాలని కోరారు.
అధిక ధరలకు మెడిసిన్స్ అమ్మే నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఎల్.రమణ డిమాండ్ చేశారు. సరిపడ స్టాక్ లేక బయటి మెడికల్ షాపులపై ఆధారపడాల్సి వస్తుందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.