హైదరాబాద్ : బాలింతలు, పేద పిల్లల పౌష్టికాహారానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్ తెలిపారు. నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీని మేడె రాజీవ్ సాగర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలామృతం ద్వారా రాష్ట్రంలోని అంగన్వాడీల్లో గల చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నట్లు రాజీవ్ సాగర్ పేర్కొన్నారు. ఫుడ్స్ ఫ్యాక్టరీలో గల వసతులు, ఇతర విషయాలపై సిబ్బందితో రాజీవ్ సాగర్ చర్చించారు.