మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 13: యువతిపై సామూహిక లైంగికదాడి ఘటన మహబూబ్నగర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లాలోని ఓ మండలానికి చెందిన యువతి రోజూ మహబూబ్నగర్కు వచ్చి కూలి పనులు చేస్తుండేది. కోయిలకొండ మండలం మల్కాపూర్కు చెందిన రాజేందర్రెడ్డి అలియాస్ రాజు తన అత్తగారి ఊర్లో ఉంటూ జిల్లాకేంద్రానికి పనికి వచ్చేవాడు. ఈ క్రమంలో అదేగ్రామానికి చెందిన సదరు యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెను తన బైక్పైనే పనికి తీసుకెళ్లేవాడు. ఈనెల 5న మహబూబ్నగర్కు వచ్చిన యువతిని రాజు అతడి స్నేహితుడు ఆంజనేయులు మాయమాటలు చెప్పి ఫత్తేపూర్ అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు మద్యం తాగించి, లైంగికదాడి చేశారు. ఫొటోలు, వీడియోలు తీశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. ఈ నెల 18న యువతికి పెండ్లి జరగాల్సి ఉండగా.. పెండ్లి కొడుకుకు వీడియో, ఫొటోలు వాట్సాప్లో పంపించారు. ఈ నెల 11న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులను రిమాండ్కు తరలించారు.